కొత్తగూడెం లో నూతన గ్రంధాలయ భవన నిర్మాణం 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, జనంసాక్షి (ఫిబ్రవరి 8) :
జిల్లా గ్రంథాలయ సంస్థ కొత్తగూడెం నందు మంగళవారం గ్రంథాలయ చైర్మన్ దిందిగాల రాజేందర్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో 2022-23 సంవత్సర బడ్జెట్ ను ప్రవేశ పెట్టి ఆమోదం తెలిపారు. ఈ బడ్జెట్ లో ముఖ్యంగా 2.76 కోట్ల తో భద్రాద్రి జిల్లా కేంద్రం కొత్తగూడెం నందు ఒక కోటి రూపాయలతో నూతన జిల్లా గ్రంధాలయం భవన నిర్మాణం చేపట్టు ప్రతిపాదనకు ఆమోదం తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల గురించి అధికారులతో చైర్మన్ చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరంలో జిల్లాలో చండ్రుగొండ, దమ్మపేట, దుమ్ముగూడెం మండలాలలో నూతన గ్రంథాలయాల భవనాలను నిర్మించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఏ. మంజువాణి, డిపిఆర్ఓ శ్రీనివాసరావు, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ ధనరాజు, డి పి ఓ రమాకాంత్, డి ఈ ఓ కార్యాలయం తరపున మాధవరావు, సంస్థ గౌరవ సభ్యులు అక్కిరాజు గణేష్, అల్లం వెంకమ్మ, తదితరులు పాల్గొన్నారు.