కోటగిరి ఎంపిపిఎస్ పాఠశాలను తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్

కోటగిరి అక్టోబర్ 19 జనం సాక్షి:-కోటగిరి మండల కేంద్రంలోని ఎంపిపిఎస్ పాఠశాలను మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున స్పెష ల్ ఆఫీసర్ రమేష్ పరిశీలించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఊరు మన బడి కార్యక్ర మానికి కోటగిరి మండలం నుండి 16 పాఠశాలలు ఎంపిక కావడం జరిగిందన్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశా ల మేరకు మన ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి విడతగా మండలంలో 4 పాఠశా లలను ఎంపిక కాగా,అందులో 4 పాఠశాలలలో నెలకొన్న త్రాగు నీరు, టాయిలెట్స్,మౌలిక,మేజర్ వసతులను వారం రోజులలో పూర్తి చేసుకొని మన ఊరు మన బడి కార్యక్రమ లక్ష్యాన్ని అధిగమిస్తా మని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ మారు తి,స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్,ఈడబ్ల్యుఐడిసి ఎ.ఈ నాగేశ్వర్ రావ్,ఎంపిపిఎస్ కోటగిరి ప్రిన్సిపల్ గంగాధర్,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.