క్రీడాజ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వి ఎం అబ్రహం

అయిజ,ఆగస్టు 29 (జనం సాక్షి):
జాతీయ క్రీడా దినోత్సవం  సందర్భంగా అయిజ మండలంలో ఉత్తనూర్ గ్రామంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్ వియం అబ్రహం .క్రీడా కు సంబంధించిన జెండా ఆవిష్కరించారు.క్రీడాజ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది.క్రీడాకారులు, క్రీడాభిమానులకు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది.స్వర్గీయ ఉత్తనూర్ పి తిరుమల్ రెడ్డి  ఆశయలను వారి కుమారుడు  గౌతమ్ రెడ్డి  కొనసాగించడం.చాలా సంతోషకరంగా ఉంది.అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉన్నత  పాఠశాలలు మండల స్థాయి క్రిడా మరియు సాంస్కృతిక సంబరాలు ప్రారంభించడం జరిగింది.ఈ సదర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.
మారుమూల పల్లెల్లో పుట్టి ఆసక్తితో, స్వయంకృషితో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న క్రీడాకారులకు నా అభినందనలు.ఉత్తనూర్ గ్రామంలో క్రీడాకారుల సౌలభ్యం కోసం అన్ని వసతులతో ఎన్టీఆర్ మినీ స్టేడియం నిర్మించాం.ఈ స్టేడియంలోని వసతులను క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలి క్రీడాకారులకు అన్ని విదాలుగా ప్రోత్సాహం అందిస్తాం..ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు, అదికారులు,టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, క్రిడకారులు,ఉపాద్యాయులు,తదితరులు పాల్గొన్నారు..