ఖండేబల్లుర్ లో దోమలమందు పిచికారి

జుక్కల్ , సెప్టెంబర్ 20, (జనంసాక్షి),
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం ఖండేబల్లుర్ లో
మంగళవారం సర్పంచ్ మహానందా శివరాజ్ దోమల మందు పిచికారి చేయించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ప్రజలకు దోమలనివారణ ఆవశ్యకతను తెలియజేశారు. దోమలు వృద్దిచెందితే ప్రజలు వ్యాధుల బారినపడతారని తెలిపారు. పారిశుద్ధ్యం పాటించడంవల్ల దోమలు నివారించ వచ్చని తెలిపారు. ప్రజలు ఇల్లు, వాకిళ్ళు, పశువుల కొట్టాలు శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు. చెత్తను వీదుల్లో పారవెయ్యవద్దని తెలిపారు. ప్రతిరోజూ గ్రామంచాయతీ ట్రాక్టర్ చెత్త కోసం గ్రామవీదుల్లో తిరుగుతుందని ప్రజలు ఆ ట్రాక్టర్ లో చెత్తను వేయాలని కోరారు. బహిరంగ మలవిసర్జన చేయరాదని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంట వార్డ్ మెంబర్లు, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.