ఖాళీ పాలడబ్బాలతో టీఆర్ఎస్ నిరసన
చండ్రుగొండ జనంసాక్షి (జులై 21) : పాల పై కేంద్రం జిఎస్టి విధించటాన్ని నిరసిస్తూ గురువారం మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు నిరసనకు దిగారు. ఖాళీ పాలడబ్బాలతో జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పార్టీ మండల అధ్యక్షుడు స్థానిక ఎంపీటీసీ దారా వెంకటేశ్వర్లు (బాబు )మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ పాలన తో సామాన్య ప్రజలు బ్రతుకు పోరాటం సాగించాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. అమాయక ప్రజలకు ఉపయోగపడే ప్రతి ఒక్క వస్తువుపై జీఎస్టీ పేరుతో అక్రమ దందా సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్యుల పాలిట శాపంగా మారిన జిఎస్టి మహమ్మారిని ఉపసంహరించాలని దీనిపై ప్రధానమంత్రి స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిరసన వ్యక్తం చేసిన వారిలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చిదేళ్ల పవన్ కుమార్,రామరాజు ,మళ్లెం వెంకటేశ్వర్లు,మధిరాల పిచ్చయ్య,శ్రీను, రాంబాబు,సోషల్ మీడియా అధ్యక్షుడు వంకాయలపాటి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.