అక్టోబర్‌ 2 నుంచి కొత్త రేషన్‌కార్డులు

కొత్త రేషన్‌కార్డుల జారీ కోసం అక్టోబర్‌ 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. అర్హులందరికీ డిజిటల్‌ రేషన్‌కార్డులు ఇచ్చే అంశంపై కసరత్తు చేశారు. దీనిపై త్వరలోనే మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం మంత్రులతో సబ్‌ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ప్రభుత్వం అక్టోబర్‌ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది.