గంటలో క్లయిం డబ్బులు చెల్లింపు

నమ్మకానికి మరో పేరు ఎల్ఐసి
దంతాలపల్లి జూలై 18 జనంసాక్షి
దంతాలపల్లి మండలంలోని  గ్రామానికి చెందిన రాపాక వెంకన్న ఇటీవల మరణించగా సోమవారం బీమా మొత్తాన్ని అతని కుమారుడు రాపాక ఉమేష్ (నామిని)కు రూపాయలు రెండు లక్షల నలభై మూడు వేల 623 రూపాయలు కేవలం గంట వ్యవధిలో చెల్లించినట్లు భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి ) మహబూబాబాద్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కోటపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..జీవిత బీమా రంగంలో ఏకైక ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి)అని అన్నారు. అత్యంత వేగంగా క్లయిం సెటిల్మెంట్ లు చేస్తూ నమ్మకానికి మారుపేరుగా నిలిచిందని అన్నారు. కేవలం గంట వ్యవధిలో భీమా మొత్తాన్ని సెటిల్ చేసిన అధికారులు రోజారాణి, మంగ్యా నాయక్ లను, అందుకు చొరవ చూపిన అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్, డెవలప్ మెంట్ ఆఫీసర్ ధరావత్ శంకర్, ఏజెంట్ బాణాల బిక్షపతి లను అభినందించారు.