గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా జరపాలి-సిఐ రామన్

గాంధారి జనంసాక్షి ఆగస్టు 30
 కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో వివిధ గ్రామాలలో  గణేష్ ఉత్సవాలు అందరూ శాంతియుతంగా జరుపుకోవాలని సీఐ రామన్  సూచించారు ఇందులో భాగంగా ప్రతి సంవత్సరంలాగే ఈ సారి కూడా ప్రతి ఒక్కరూ పర్మిషన్ తీసుకొని పెట్టాలి మరియు డీజేలకు పర్మిషన్ లేదు కాబట్టి పోలీసులు చెప్పిన విధంగా నడుచుకొని  ఉత్సవాలలో ఎలాంటి అంతర్యాలు కలుగకుండా జరుపుకోవాలని సీఐ రామన్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ గంగారం గణేష్ మండల ప్రజా ప్రతినిదులు  యూత్ సభ్యులు మరియు గాంధారి పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు