గణేష్ మండపాలలో ప్రత్యేక పూజలు చేసిన కార్పొరేటర్.

మల్కాజిగిరి.జనంసాక్షి.సెప్టెంబర్3
నేరేడ్‌మెట్‌ డివిజన్‌లోని యాప్రాల్‌ రిజిస్ట్రేషన్‌ కాలనీలో  ప్రెసిడెంట్ తరుణ్ ఆనంద్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్‌ మండపములో కార్పొరేటర్‌ మీనా ఉపేందర్‌ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.అనంతరo మండప నిర్వాహకులు ఆమెను శాలువాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం అన్నదానం కార్యక్రమంలో పాల్గొని,దాదాపు 200 మందికి పైగా పేద ప్రజలకు దుప్పట్లు,చీరలు,పిల్లలకి పుస్తకాలు మరియు పెన్నులు అందజేశారు.అనంతరం వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన గణేష్ మండ పాలలో ప్రత్యేక పూజలు చేశారు.ఈకార్యక్రమంలో మల్కాజిగిరి సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి,తరుణ్, ఆనంద్,విజయ,శోభ,నవనీత,కోటేశ్వరి, రమాదేవి,చెన్నారెడ్డి,శివ,మహేష్, ఉత్తమ్ రెడ్డి,కరుణాకర్ రెడ్డి,నవీన్, రాజేష్,కిషోర్,రాజు,మోహన్ మరియు ఇతర కాలనీ వాసులు పాల్గొన్నారు .