గద్వాల పీజీ సెంటర్లో తెలుగు భాష దినోత్సవం వేడుకలు

 గద్వాల నడిగడ్డ ఆగస్టు 29 (జనంసాక్షి )జోగులాంబ గద్వాల జిల్లా నదిఆగ్రహారం
స్నాతకోత్తర కేంద్రంలో గిడుగు వెంకట రామమూర్తి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష దినోత్సవాన్ని సోమవారం  ఘనంగా జరుపుకున్నారు.ఈ సమావేశంలో ప్రిన్సిపాల్ డాక్టర్ నెమ్మికంటి సంధ్యారాణి
అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ గిడుగు రామ్మూర్తి పంతులు తెలుగు భాష కోసం అందరూ కృషి చేయాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో అతిథిగా డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పాల్గొని తెలుగు భాష శాసన భాషను మొదలుకొని నేటి వ్యావహారిక భాషా వరకు మార్పులను భాషా గొప్పతనాన్ని తెలియపరిచారు. ఈకార్యక్రమంలో డాక్టర్ మంగళగిరి శ్రీనివాసులు అధ్యాపకులు,విద్యార్థులు,
అధ్యాపకెతర సిబ్బంది,
తదితరులు పాల్గొన్నారు.