గవర్నర్‌ ఆరోగ్యంపై వెంకయ్య ఆరా

అమరావతి,నవంబర్‌19(జనం సాక్షి  ): ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు వాకబు చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌ ఏఐజీ హాస్పిటల్‌ అధినేత డాక్టర్‌ ఎ. నాగేశ్వర రెడ్డితో ఉపరాష్ట్రపతి ఫోన్‌లో సంభాషించారు. గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం గవర్నర్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెంకయ్యకు డాక్టర్‌ నాగేశ్వర్‌ రెడ్డి వివరించారు. నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామని, త్వరలోనే ఆయన కోలుకుంటారని తెలియజేశారు.