గాజుల జనార్దన్ కుటుంబానికి ఆర్థిక సహాయం

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ (సెర్ప్)

కొత్తగూడ జూలై 22 జనంసాక్షి:జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ(సెర్ప్) ద్వారా గాజుల జనార్ధన్ కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందించారు.వివరాల్లోకి వెళ్ళగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల సమాఖ్య నందు వేలుబెల్లి గ్రామానికి చెందిన గాజుల జనార్ధన్ గత కొన్ని సంవత్సరాలుగా సి.సి గా విధులు నిర్వహిస్తూ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది.సంస్థ అతని కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఎక్స్గ్రేషియా అమౌంటును స్త్రీనిధి ద్వారా జిల్లా డి.ఆర్.డి.ఓ అర్.సన్యాసయ్య చేతుల మీదుగా 1,50,000 రూపాయల చెక్ ను నామినీ అయిన అతని భార్య గాజుల పద్మ కు అందించారు.ఈ కార్యక్రమంలో స్త్రీ నిధి ఆర్.ఎం మధుసూదన్,అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత,ఏ.పి.యం అశోక్,ఏ.ఓ పాల్గొనడం జరిగినది.