గిరిజనులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

 బషీరాబాద్ అక్టోబర్1,(జనం సాక్షి) బషీరాబాద్ మండల పరిధిలో శాసన సభ్యులు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు గిరిజనులు బషీరాబాద్ పార్టీ ప్రెసిడెంట్ రాము నాయక్ ఆధ్వర్యంలో భారీగా బయలుదేరి తాండూరు అంబేద్కర్ చౌరస్తా వద్ద  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తెరాస పార్టీ అధ్యక్షులు రాము నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాస్ట్రంలో గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు ప్రకటన చేసిన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర రథసారథి, ప్రజా నేత, మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజు రెడ్డి (నర్సిరెడ్డి),బషీరాబాద్ మండల ఎస్టి సెల్ అధ్యక్షులు నరేష్ చవాన్, బషీరాబాద్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ బి.ఆర్ శ్రీనివాస్, సీనియర్ నాయకులు సర్యానాయక్, మోహన్సింగ్, సర్పంచులు దేవ్ సింగ్, శివా నాయక్, శంకర్, రవీందర్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు,మహిళలు,  తదితరులు పాల్గొన్నారు.
Attachments area