గురుకుల పాఠశాల/కళాశాలను సందర్శించిన పంచాయతీ అధికారి గంగా భవాని

కేసముద్రం సెప్టెంబర్ 15 జనం సాక్షి / గురువారం స్వచ్ఛ గురుకుల్ డ్రైవ్ లో భాగంగా   మండలంలోని ఇనుగుర్తి గ్రామం లోని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాలను మహబూబాబాద్ డివిజన్ లెవల్ పంచాయితీ అధికారిని గంగా భవాని సందర్శించి పాఠశాల ప్రిన్సిపాల్ విజయ లలిత సమక్షంలో పాఠశాల లోని వివిధ విభాగాలు తరగతి గదులు,భోజన శాల,డైనింగ్ హాల్ మరియు పాఠశాల ఆవరణంలో పర్యవేక్షణ చేశారు.పర్యవేక్షణ అనంతరం పాఠశాల ఆవరణంలో ఎటువంటి చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉందని,పచ్చని చెట్లు,గోడల పై పెయింటింగ్ లు ఆకట్టుకునేలా ఉన్నాయని స్వచ్ఛ గురుకుల్ లో పాల్గొన్న విద్యార్థులను,సహకరించిన ఉపాధ్యాయ బృందాన్ని గంగా భవాని అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ బి.భాగ్యం, సూపరింటెండెంట్ భరత్ ,జూనియర్ వైస్ ప్రిన్సిపల్ టి.మాధవి,ఉపాధ్యాయులు బి.వెంకయ్య,బి.ధనలక్ష్మి, ఉపాధ్యాయ,ఉపాద్యేతర బృందం పాల్గొన్నారు.
Attachments area