గొర్రెలకు నట్టల మందు పంపిణీ చేసి, వర్షాకాలం వ్యాపించే రోగాలపై అవగాహన కల్పించిన పశువైద్యాధికారి

బయ్యారం, జూన్ 10(జనంసాక్షి):
బయ్యారం మండలంలోని
ఇర్సులాపురం గ్రామ పంచాయతీ పరిధిలో గంధంపల్లి పశు వైద్యాధికారి టి.రాజేందర్ శుక్రవారం గొర్రెల కాపరులకు అవగాహన కార్యక్రమం భాగంగా వర్షాకాలంలో గొర్రెలకు  వ్యాపించే వ్యాధులపై అవగాహన కల్పించారు.తదుపరి గొర్రెల మందలకు ప్రభుత్వం ద్వారా వచ్చే నట్టల మందు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి గంధంపల్లి పశువుల వైద్యాధికారి టి.రాజేందర్,ఇర్సులాపురం గొర్రెల సొసైటీ అధ్యక్షులు రేఖ ఉప్పలయ్య యాదవ్,కేస నిరంజన్ యాదవ్,రామనాధం,కత్తుల సతీష్,వెంకన్న రామలిగం,నిమ్మల వీరన్న,కోడి వెంకన్న,కేస సంపత్,స్వర్గం వెంకన్న,రసమల్ల అనిల్ యాదవ్,వెటర్నరీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు..