గ్రానైట్‌ కంపెనీలో భారీ పేలుడు

వరంగల్ సెప్టెంబర్‌26 జనం సాక్షి  : అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వజ్రా మ్యాట్రిక్స్ గ్రానైట్ కంపెనీలో పేలుడు సంభవించింది.  ఈ పేలుడు కారణంగా ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో  ప్రియాంక అనే యువతి పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు.