గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్‌ జెండాలను ఆవిష్కరించాలి

మహబూబాబాద్‌ జూలై 5 (జనంసాక్షి):
ఈనెల 7న ఎమ్మార్పీఎస్‌ 9వ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా కురవి మండలంలోని గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్‌ జెండాలను ఎగురవేయాలని ఎమ్మార్పీఎస్‌ డిివిజన్‌ అధ్యక్షులు ధర్మారపు కనకయ్య అ న్నారు. కురవి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం చుక్క ఎల్లయ్య మాదిగ అధ్యక్షతన జరి గింది ఈసమావేశానికి ముఖ్య అతిదిగా ధర్మారపు కనకయ్య ఆజరై మాట్లాడుతూ ఈనెల 10వ తారీకు వరకు కురవి మండల పరిదిలోని అని గ్రామాలలో యంఆర్‌పియస్‌ గ్రామ కమిటిలుపూర్తి చేయాలని కోరారు.నూతన గ్రామ కమిటిల నియామకానికి చుక్క ఎల్లయ్య, మిరియాల శ్రీనివాస్‌, కిన్నెర మల్లయ్య, ఇనుగుర్తి దేవయ్య, దైద ముత్తయ్య, తోకల రామచంద్రులను నియమించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ మహబాద్‌ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి కిశోర్‌ కుమార్‌,దైద భద్రయ్య,పడిదెల నారాయణ, పడిదెల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.