గ్రామసభలే పల్లెలకు శాసనం…!

వేమనపల్లి,నవంబర్ 15,(జనంసాక్షి):

వేమనపల్లి మండలంలోని గొర్లపల్లి గ్రామపంచాయతీలో సర్పంచ్ మోర్లపద్మ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.ఈ సభలో ఏపీవో సత్య ప్రసాద్ మాట్లాడుతూ 2023-2024 సంబంధించిన పనులు గుర్తించి రాబోయే సీజన్ లో చేపట్టవలసిన 90 రకాల పనులు,గ్రామ పంచాయతీకి కేటాయించిన నిధులు,నియమ నిబంధనలు తెలియజేశారు.అనంతరం గ్రామపంచాయతీలో జరుగుతున్న ఉపాధిహామీ ఫారం పోండ్ పనులను పరిశీలించి కూలీలకు తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో సాంకేతిక సహాయకులు సుధాకర్,వార్డ్ సభ్యులు,పంచాయతీ కార్యదర్శి సాయికృష్ణ,క్షేత్ర సహాయకులు రాజలింగు,ప్రజలు పాల్గొన్నారు.