గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.
జనం సాక్షి ,శంకరపట్నం,
గ్రామాల అభివృద్ధిటిఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమనిమానకొండూరు ఎమ్మెల్యేడాక్టర్ రసమయి బాలకిషన్ అన్నారు.శంకరపట్నం మండలం తాడికల్, ఇప్పలపల్లె,అంబాలుపూర్ గ్రామాల్లో మంగళవారం వేకువజామున పర్యటన చేశారు. మండలంలోని ఇప్పలపల్లి గ్రామంలో దళిత బందు లబ్ధిదారులతో మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చిన దళిత మందు వాహనాలు, యూనిట్లు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మండలంలోని 3 గ్రామాల్లో సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండలంలోని అంబాల పూర్ గ్రామానికి చెందిన ముంజ హరీష్ కుటుంబాన్ని పరామర్శించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తో ఫోన్లో మాట్లాడారు. ఆర్ ఎఫ్ సి ఎల్ఉద్యోగం కోసం డబ్బులు వసూలు చేసిన సంఘటనలో ఆత్మహత్య చేసుకున్న.హరీష్ కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంటా మహిపాల్, సర్పంచ్ సంపత్, ఎంపిటిసి తిరుపతయ్య, నాయకులు మల్హర్రావు,ముంజ వెంకటేష్,కిసార సంపత్,నంది రెడ్డి,బుదత్తు సంపత్,రమణారెడ్డి,సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.