*గ్రామ పంచాయతీ సిబ్బందికి రెయిన్ కోర్ట్ ల పంపిణీ*

కొడకండ్ల, జులై23(జనం సాక్షి):
కొడకండ్ల మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి రెయిన్ కోర్ట్ లను  గ్రామ సర్పంచ్ పసునూరి మధుసూదన్,గ్రామ కార్యదర్శి గంటా శ్రీనివాస్ ఆద్వర్యంలో రెయిన్ కోర్టు లను పంపిణీ చేశారు.అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ వానకాలంలో  గ్రామ పంచాయతీ సిబ్బంది తడిసి అనారోగ్యాల పాలు కాకుండా రెయిన్ కోర్ట్ లను పంపిణీ చేశామని తెలిపారు.అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ పంచాయతీ పాలక వర్గానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో యంపీడిఓ సురేంద్రనాయక్,  యంపీటీసీ కుందూరు విజయలక్ష్మి, ఏ పి ఓ కుమారస్వామి,ఉప సర్పంచ్  బోయిని  రమేష్,వార్డు మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.