గ్రీన్‌ఛాలెంజ్‌ స్వీకరించిన కలెక్టర్‌ ఆమ్రపాలి

వరంగల్‌,జూలై26(జ‌నంసాక్షి): తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని వడ్డపల్లి చెరువు కట్టవిూద కలెక్టర్‌ ఆమ్రపాలి మొక్కలు నాటారు. ఆ తర్వాత వరంగల్‌ మేయర్‌ నరేందర్‌తో పాటు టిఎన్జీవో ఉద్యోగులకు, విద్యార్థులకు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ లో భాగంగా తలా మూడు మొక్కలు నాటాలని ఆమ్రపాలి పిలుపునిచ్చారు. ఆమ్రపాలితో పాటు మున్సిపల్‌ కమిషనర్‌ గౌతమ్‌, ఆఈక్ష అర్పణ, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు.