ఘనంగాదత్త జయంతి వేడుకలు…

భైంసా రూరల్ డిసెంబర్ 07 జనం సాక్షి

నిర్మల్ జిల్లా బైంసా మండలం వానల్ పాడ్ గ్రామంలో బుధవారం పౌర్ణమిని పురస్కరించుకొని ఘనంగా దత్త జయంతి పౌర్ణమి వేడుకలు జరుపుకున్నారు. గ్రామస్తులంతా దత్త మందిరంలో దత్తాత్రేయ విగ్రహానికి ఉయ్యాలకార్యక్రమం ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపి కల్పనా గణేష్, సర్పంచ్ రాజన్న,ఈశ్వర్, రామ్ కుమార్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.