ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు…

కామారెడ్డి సెప్టెంబర్27 జనంసాక్షి;
అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధనలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ముఖ్య పాత్ర పోషించారని పేర్కొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారిని ఏకతాటిపై తీసుకువచ్చారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రావు, ఎంపీపీ ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందూ ప్రియ, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.