ఘనంగా కెటిఆర్ పుట్టినరోజు వేడుకలు

* టిఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

జూలూరుపాడు జులై 24, జనంసాక్షి:
టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర ఐటి పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఆదేశాల మేరకు టిఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఆదివారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వృద్ధులు, వితంతువులకు నాయకులు దుస్తులు పంపిణీ చేశారు. మొక్కులు నాటే కార్యక్రమం నిర్వహించి ప్రధాన రహదారిపై భారీ వాహన ర్యాలీ నిర్వహించి, బాణాసంచా కాల్చారు. జై కేటీఆర్, జై రాములు నాయక్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి లావుడియా సోని, జడ్పిటిసి భూక్యా కళావతి, కాకర్ల ఎంపిటిసి పొన్నెకంటి సతీష్ కుమార్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు యదళపల్లి వీరభద్రం, టిఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చౌడం నరసింహారావు, నున్న రంగారావు, నాయకులు లకావత్ గిరిబాబు, రోకటి సురేష్, వేల్పుల నరసింహారావు, దుద్దుకూరి కృష్ణ ప్రసాద్, సర్పంచులు గలిగె సావిత్రి, లావుడ్యా కిషన్ లాల్, కట్రం మోహన్ రావు, బోడ శాంతిరాం, బానోత్ శాంతిలాల్, బానోతు నరసింహారావు, ముక్తి నరసింహారావు, బాదావత్ లక్ష్మి, బోడ కైక, భూక్య పద్మ, ఏఎంసి డైరెక్టర్లు సపావత్ నరేష్, హలావత్ నరసింహారావు, మల్లెల నాగేశ్వరరావు, బానోతు రాంజీ, చాపలమడుగు రామ్మూర్తి, మోదుగు రామకృష్ణ, మోదుగు నర్సింహారావు, ఇల్లంగి తిరుపతి, బుడిపుడి ప్రభాకర్, సుభాని, మహబూబ్, దేవరకొండ కిరణ్, పణితి వెంకటేశ్వర్లు, గుగులోతు చంటి, మాడుగుల నాగరాజు, మంద నరసింహారావు, ఎలకపల్లి నరేష్, మంద సురేష్, గార్లపాటి గోపాల్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.