ఘనంగా జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ జన్మదిన వేడుకలు…

-సరిత తిరుపతయ్య యూత్ అధ్వర్యంలో రోగులకు పాలు,బ్రెడ్లు,పండ్లు పంపిణీ..

 

గద్వాల రూరల్ సెప్టెంబరు 06 (జనంసాక్షి):- ‘‘ప్రజాసేవకు అసలైన నిర్వచనం చెబుతూ, బడుగు బలహీన వర్గాల బంధువుగా పిలువబడుతున్న జోగులాంబ గద్వాల జిల్లా మొదటి మహిళా జెడ్పి చైర్ పర్సన్ శ్రీమతి సరితమ్మ కు మాజీ ఉమ్మడి జిల్లా జెడ్పి చైర్మన్ బండారి భాస్కర్,గద్వాల మున్సిపల్ చైర్మన్ బి.ఎస్.కేశవ్,ఇటిక్యాల జెడ్పిటిసి హన్మంతు రెడ్డి, ఎంపిపి స్నేహ శ్రీధర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అభిమానులు, శ్రేయోభిలాషిలు,అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, వివిధ కులసంఘాల నాయకులు మర్యాద పూర్వకంగా జెడ్పి చైర్ పర్సన్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు…అభిమాన నాయకురాలై జెడ్పి చైర్ పర్సన్ దంపతులను గజమాలతో సన్మానం చేశారు..ప్రజల ఆశీర్వాదంతో మీరు నిండు నూరేళ్లూ ఆనంద ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ‘‘ జోగులాంబ అమ్మవారి, జములమ్మ అమ్మవారి ఆశీస్సులతో మరెన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించి ప్రజా సేవలో మహిళా నాయకురాలుగా నడిగడ్డ ప్రాంతంలోని బడుగు బలహీన వర్గాల బహుజన పేదల బాధలు తీర్చడానికి అహర్నిశలు శ్రమించే మీ సేవాగుణం స్ఫూర్తిదాయకం. ప్రజలే సర్వస్వంగా భావించే మీకు ప్రజాదరణ పొంది ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషిలు,టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఆకాంక్షించారు..