ఘనంగా పొదెం మధు చంద్ర జన్మదిన వేడుకలు.

బూర్గంపహాడ్ జూలై 26(జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో మహిళా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో బి బ్లాక్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బర్ల నాగమణి అధ్యక్షతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు పొదెం  మధుచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆమె మనసారా అభిలషించారు. వారికి మరింత ప్రజాదరణ శక్తి యుక్తులు ఆ దేవుడు కలగజేయాలని కోరుకుంటూ కేక్ ను కట్ చేశారు. ఈ కార్యక్రమం లో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మైపా మణి, బ్లాక్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసుపాక సావిత్రి, పుల్లమ్మ, వెంకట నర్సమ్మ, రమణ, రత్తమ్మ తదితరులు పాల్గొన్నారు.