*ఘనంగా బంజారా బోనాల పండుగ

ఎల్లారెడ్డి 30 ఆగస్టు (జనంసాక్షి)
 నాగిరెడ్డిపేట్ మండలంలోని మెల్లకుంట తాండలో బంజారులు మంగళవారం సేవలాల్ మహరాజ్ కు బోనాలను ఘనంగా నిర్వహించారు.బంజారుల ఆరాధ్యదైవం సేవలాల్ మహరాజ్ కి భక్తి శ్రద్దలతో పూజలు చేసారు.ఈ సందర్భంగా గిరిజన శక్తి ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు మోహన్ నాయక్ మాట్లాడుతు సేవాలాల్ మహరాజ్ జగదాంబ దేవికి బంజారా మహిళలు నైవేద్యాలు సమర్పించారు.భారీసంఖ్యలో ఆలయాలకు తరలి వచ్చి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.ఈ పండుగను మహిళలు శ్రావణమాసంలో ఐదు మంగళవారాల పాటు ఉపవాస దీక్ష చేసి మంగళవారం విరమింప చేసారు.మహిళలు సాంస్కృతిక వేషధారణతో నృత్యాలు ఆటపాటలతో గుడి చుట్టు ఐదు ప్రదక్షిణలు చేసి తండా ప్రజలు ఆయుఆరోగ్యలతో సుఖ సంతోషాలతో పడిపంటలతో సంతోషంగా ఉండాలని దేవునికి కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో తండా సర్పంచ్ కొర్ర కెస్లీ వసూరం,ఎంపీటీసీ సుజాత,కరోబర్,బాబు నాయక్,రాంసింగ్ నాయక్ రమేష్ ,గణేష్ సుభాష్ చౌహన్ మరియు తండా ప్రజలు పాల్గొన్నారు.