ఘనంగా బర్త్డే వేడుకలు

డోర్నకల్ జూలై 24 జనం సాక్షి

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం డోర్నకల్ ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి కేటీఆర్ కు బర్త్ డే విషెస్ తెలిపారు.కార్యకర్తలు,ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు.
ఇదిలా ఉండగా కేటీఆర్ తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండనున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద రోగులకు,వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నున్నా రమణ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్,తనయుడు కేటీఆర్ తోనే బంగారు తెలంగాణ సాధ్యమని అన్నారు.ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ సూచనల మేరకు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు నున్నా రమణ,చైర్మన్ వీరన్న,పట్టణ అధ్యక్షుడు విద్యాసాగర్, కౌన్సిలర్లు పోటు జనార్ధన్,సురేందర్, శరత్,అశోక్,కో ఆప్షన్స్ సభ్యులు,నాయకులు
పోకల శేఖర్,కొత్త వీరన్న,
గౌస్,అనిల్,విక్కీ తదితరులు పాల్గొన్నారు.