ఘనంగా మండల ఆవిర్భావ దినోత్సవం..

ఊరుకొండ, అక్టోబర్ 12 (జనంసాక్షి):
ఊరుకొండ గ్రామం మండల కేంద్రంగా ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా మండల కేంద్రంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహ ఆవరణలో మాజీ సర్పంచ్ మ్యాకల శ్రీనివాసులు ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యార్థిని విద్యార్థుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి బాణసంచా కాల్చి మండల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని కొంతమంది పెద్దలను పూల మాలలు, శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఊరుకొండ మండల ప్రదాత, జడ్చర్ల శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు డాక్టర్ చర్లకోల లక్ష్మారెడ్డి గారికి మరియు సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ నెంబర్ కలీం పాషా, గ్రామ పెద్దలు కృపయ్య, యాదగిరి, దశరథ, చంద్రమౌళి, యాదయ్య, ప్రసాద్, సందీప్ కుమార్, బిక్షపతి, వెంకటయ్య, జగదీష్, మహమూద్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.