ఘనంగా రాజీవగాంధీ జయంతి వేడుకలు

కడం ఆగస్టు (జనం సాక్షి ) మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలం లోని మాసాయి పెట్ గ్రామం లో  స్వర్గీయ భారత రత్న  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 78వ జయంతిని  ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు పొద్దుటూరి సతీష్ రెడ్డి మరియు మహిళ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ch దుర్గాభవాని  మాట్లాడుతూ  అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జవహర్ రోజుగారి యోజన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కి తోడ్పడిన వ్యక్తి  దేశ అభివృద్ధి ని ముందుకుతీసుకెళ్ళిన వ్యక్తి రాజీవగాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమం లో కడం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు వాజీద్ ఖాన్.sc సెల్ కన్వీనర్ తరి శంకర్ మైనారిటీ నాయకులు షేక్ రఫీక్ సలీం.  బబ్లు  మల్లేష్ యాదవ్ యాదగిరి  రహీం లింబన్న సత్యం చారి. లచ్చన్న ఓజన్నతదితరులు పాల్గొన్నారు