ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నాడు భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు చేశాడని, ఆయన పాలన కాలంలో అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో సోదర భావంతో ఉండేందుకు కావలసిన కృషి చేశాడని, ప్రజలను విభజించడానికి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం అలాంటి గొప్ప నాయకులు లేక భారతదేశం అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే భారతదేశంలో ప్రస్తుతం ఉన్న అసమానతలు తొలగిపోయి దేశ అభివృద్ధికి అవకాశ మార్గాలు ఏర్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆఫీస్,వైస్ ఎంపీపీ పెద్దేడ్ల నర్సింలు, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు గోవింద్ నాయక్,చిరంజీవిలు, లింబేష్,కాశీరాం, నిజాం తదితరులు పాల్గొన్నారు.