ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

చిట్యాల 2(జనం సాక్షి) మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి ఎమ్మార్వో వేణుగోపాల్ ,కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూట్ల తిరుపతి, బీజేపీ ఆధ్వర్యంలో  గ జనాల రవీందర్, వివిధ గ్రామాల్లో తెరాస గ్రామ అధ్యక్షులు, మండల పరిషత్ కార్యాలయం, మండల కేంద్రంలోనీ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆరెపల్లి మల్లయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జెడ్పిటిసి గొర్రె సాగర్ ముఖ్య అతిథిగా హాజరై  పాల్గొన్నారు. అనంతరం
ఈ సందర్భంగా జడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధిలో, దేశంలో ముందంజలో ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటుకోసం అసువులు బాసిన ఎందరో మాహానీయుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు.