ఘనంగా హజరత్ జాన్ పాక్ అమిరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు…

కేసముద్రం సెప్టెంబర్ 20 జనం సాక్షి / కేసముద్రం విలేజ్ లోని హజరత్ జాన్ పాక్ అమిరుద్దీన్ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు సోమవారం రాత్రి ఘనంగా ప్రారంభం అయ్యాయి.ఈసందర్బంగా సోమవారం రాత్రి జరిగిన ఉత్సవాలలో సందల్ గంధం ఊరేగింపుగా బయలుదేరి దర్గాను చేరుకుని,అనంతరం ఖవాలి కార్యక్రమాన్ని నిర్వహించారు.అదేవిదంగా మంగళవారం ఉదయం నుండి ఉరుసు దర్గా దర్శనాన్ని నిర్వహించి, పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కమిటీ అధ్యక్షులు
షేక్ యాకుబ్ పాషా ఈసందర్బంగా తెలిపారు