– చండ్రుగొండ యూత్ కాంగ్రెస్ నాయకులు

చండ్రుగొండ జనంసాక్షి (జులై  22) : అశ్వారావుపేట నియోజకవర్గంలోని మండలాల వారీగా   పేరుకుపోయిన సమస్యల పరిష్కారం   మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు  తాటి   వెంకటేశ్వరరావు తోనే సాధ్యమని చండ్రుగొండ మండల యూత్ కాంగ్రెస్ నాయకులు అన్నారు. మద్దుకూరు గ్రామ సర్పంచ్  పద్దం వినోద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు  నల్లమోతు రమణ, చుండ్రు విజయ్ ల ఆధ్వర్యంలో  శుక్రవారం  దమ్మపేటలోని తాటి నివాసగృహంలో ఆయన్ను  కలిశారు. మద్దుకూరు పంచాయతీలోని పలు సమస్యల లో ఒకటైన  తాగునీటి సమస్యను  తాటి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే  స్పందించిన తాటి  సంబంధిత అధికారులతో ఫోన్ లైన్ లో   మాట్లాడారు. తక్షణం మంచినీటి సమస్య తీర్చాలని  లేని పక్షంలో సమస్యను  కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. అనంతరం  పోడు భూముల సమస్యల పరిష్కారానిక  కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉందని  రాబోయే రోజుల్లో  పోడు    సమస్య  పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్బంగా  మండల కాంగ్రెస్ నాయకులు  మాట్లాడుతూ నాడు  తాటి నియోజకవర్గ ఎమ్మెల్యేగా  ఉండి  మంజూరు చేసిన తారురోడ్డుకు  ఏర్పడ్డ  గుంతలు పూడ్చే దిక్కులేక పోయిందని విమర్శించారు. మండల పర్యటనకు రావాలని కోరారు. తాటి ని కలిసిన వారిలో  యువ కాంగ్రెస్ నాయకులు,  కార్యకర్తలు,అభిమానులు   ఉన్నారు.
Attachments area