చంద్రబాబుకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  కోయిల్‌ కోండ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తెలంగాణవాదులు భగ్గుమన్నారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ బాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న టీడీపీ నేతలు తెలంగాణ వాదులపై దాడికి తెగబడ్డారు. దీంతో అక్కడ తెలంగాణవాదులకు .టీడీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీఛార్జీ జరిపారు. ఉద్రిక్తత ఇంకా కొనసాగుతుంది.