చెట్టును ఢీకొన్న స్కార్పియో, నలుగురు మృతి

కట్టంగూర్‌: నల్గొండ జిల్లా విజయవాడ-హైదరాబాదు రహదారిపై కట్టంగూరు శివారులో కాకినాడ వెళ్తున్న స్కార్పియో వాహనం అతి వేగంతో వచ్చి రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వాహనంలోని ముగ్గురు మహిళలతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను నార్కేట్‌పల్లి ఆసుపత్రికి తరలించారు.