చేర్యాలలో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి..

చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 20 : చేర్యాల  మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం కాంగ్రెస్ పార్టీ చేర్యాల మండల అధ్యక్షులు అది శ్రీనివాస్ ఆధ్వర్యంలో జయంతిని ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పులమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన సంస్కరణల వల్లనే దేశంలో ఐటిని అగ్రగామిగా నిలిపిన ఘనత రాజీవ్ గాంధీ దేనని పేర్కొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టా రన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సుంకరి శ్రీధర్, పీఏసీఎస్ డైరెక్టర్ కొమ్ము రవి, వెలుగల దుర్గయ్య, బుడిగే రమేష్, కర్క సంతోష్ రెడ్డి, నర్ర మహేష్, భూమని బాలరాజు, గుడ్ల బాబు, నాగరాజు, జల్లి శ్రీనివాస్, మల్లయ్య, వెలుగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.