చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షులు తోట మహేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన : ఎమ్మెల్సీ బోగారాపు దయానంద్ గుప్తా

   ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  పుట్టినరోజు నాడు మొక్కలు నాటడం సంతోషదాయక విషయమని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ అన్నారు  .  చైతన్యపురి డివిజన్ తెరాస అధ్యక్షులు తోట మహేష్ యాదవ్  జన్మదిన సందర్భంగా  బుధవారం చైతన్యపురి డివిజన్ లోని ఓ పార్కులో జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు  .  ఎమ్మెల్సీ బోగారాపు దయానంద్గుప్తా ముందుగా తోట మహేష్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.  అనంతరం  పార్క్ లో గుప్తా  మొక్కలు నాటడం జరిగింది .ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు బోగారాపు శరత్ చంద్ర భూపేష్ రెడ్డి .ప్రవీణ్ చారి దేవేందర్. సంపత్ కుమార్. హరీష్ యాదవ్ మధుకర్ .టీఎంవై యువసేన సభ్యులు  తదితరులు  పాల్గొన్నారు