చౌటుప్పల్‌ చేరిన సీపీఐ పాదయాత్ర

చౌటుప్పల్‌: మునుగోడు ఎమ్మెల్యే యాదగిరి రావు ఆధ్వర్యంలో సీపీఐ చేపట్టిన పాదయాత్ర చౌటుప్పల్‌కు చేరింది. నక్కలగంజి ఎత్తిపోతల పథకానికి నిధులుమంజూరు చేయాలని, ఎన్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ఈ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రకు చౌటుప్పల్‌లో తెదేపా, సీపీఎం నేతలు స్వాగతం పలికి సంఘీభావం ప్రకటించారు.