జడ్జిలకు 26 వరకు జ్యుడీషియల్‌ రిమాండ్‌

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో అరెస్టు అయిన జడ్డిలు ప్రభాకర్‌రావు, లక్ష్మినరసింహలను ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. వీరికి ఈ నెల 26 వరకు ఏసీబీ కోర్టు జ్యుడీషియాల్‌ రిమాండ్‌ విధించింది. అనంతరం వారిని జైలుకు తరలించారు.