జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు

బెల్లంపల్లి, నవంబర్ 16, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తా ఏరియాలో బుధవారం. ఈ సందర్బంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ అన్ని దానాల్లో కెల్ల అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చడం సంతోషంగా ఉందని అన్నారు. దాతల సహకారంతో ఈకార్యక్రమం గత ఏడాది ఏప్రిల్ 13న ప్రారంభించామని, వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేటితో 138వ సారి అన్నదానం చేసినట్లు తెలిపారు. నేటి కార్యక్రమం సాంబారి రాయమల్లమ్మ కనకయ్య దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు కోడలు, జనహిత అన్నపూర్ణ శాశ్వత అన్నదాత సాంబారి పద్మ లత నర్సయ్య దంపతులు, బాలాజీ క్లాత్ మార్చంట్ సహకారం తో యాచకులకు, నిరుపేదలకు, కూలీలకు, చిరు వ్యాపారులకు, బాటసారులకు ఒక పూట ఆకలి తీర్చేందుకు అన్నదానం చేసినట్లు ఆయన వివరించారు. ఈకార్యక్రమం ద్వారా సుమారు 180 మందికి అన్నదానం చేశామన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కోసం మరింత మంది దాతలు ముందుకు రావాలని, ఇప్పటిదాకా సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు వడ్డేపల్లి విజయ ప్రభాకర్, సుంకే లక్ష్మీనారాయణ, జనహిత సేవా సమితి ప్రధాన కార్యదర్శి ఇప్ప రవి, గౌరవ సలహాదారుడు మురుకూరి బాలాజీ, సహాయ కార్యదర్శి పతంగి సంతోష్, కార్యవర్గ సభ్యులు కందుల రాజన్న, కుమ్మరికుంట ప్రసాద్, మెరుగు దేవయ్య, పాయబోయిన మల్లేష్, సింగతి తిరుమల్, నిచ్చకోలా గురుస్వామి, అక్షయ్ పాల్గొన్నారు