జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాల ని తహసిల్దార్ కు వినతి పత్రం అందించిన దోమకొండ ప్రెస్ క్లబ్ నాయకులు..

కామారెడ్డి ప్రతినిధి సెప్టెంబర్16 (జనంసాక్షి);
పాత తాలూకా కేంద్రమైన దోమకొండలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మండల తాసిల్దార్ శాంత కు నూతన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.
దోమకొండ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం నూతన ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తాసిల్దార్ శాంతకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లొ అధ్యక్షులు ముదాం శివశంకర్ పటేల్, ప్రధాన కార్యదర్శి భూపాల్ రాహుల్ లు మాట్లాడుతూ, అర్హులైన జర్నలిస్టులoదరికీ ఇళ్ల స్థలాలను కేటాయించాలని కోరారు. తహసిల్దార్ శాంత మాట్లాడుతూ ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ముదాం శంకర్ పటేల్, బండారి శంకర్, బొమ్మర బాలయ్య, అంబటి అనిల్, సబ్బని ప్రవీణ్ కుమార్, గరిగే సురేష్, గోత్రాల విక్రమ్ లు పాల్గొన్నారు