జాతీయ నులి పురుగుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలి.

ఎమ్మెల్యే భాస్కర్ రావు.
మిర్యాలగూడ. జనం సాక్షి ఈనెల 15న జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవాన్నివిజయవంతం చేయాలని, నులి పురుగుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ఆల్బెండొజోల్ మాత్రలు వేసుకోవాలని ఎమ్మెల్యే  నల్లమోతు భాస్కర్ రావు  సూచించారు. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నులి పురుగుల నిర్మూలన దినోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆశా వర్కర్లకు నూతనంగా మంజూరు అయిన చీరలను పంపిణి చేసారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసుర్లు డా.ప్రత్యూష, డా.లక్ష్మి ప్రసన్న, సూపర్వైజర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.