జాతీయ సమైక్యత వజ్రొత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-
రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రొత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు.
బుధవారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్.పీ.లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్  డిజిపి మహేందర్ రెడ్డితో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణా జాతీయ వజ్రోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీనిలో భాగంగా, 16న జరిగే ర్యాలీ, సభకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలెక్టర్లు విస్తృత ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి ప్రణాళికాబద్ధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ నెల 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు భవనాలను విధ్యుత్ దీపాలతో అలంకరించాలని పేర్కొన్నారు.
ఈ నెల 17న హైదరాబాద్‌లో ప్రధాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, జిల్లా, మండల, గ్రామ పంచాయతీ ప్రధాన కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయాలన్నారు. హైదరాబాద్ లో జరిగే ఆదివాసీ, బంజారా భవనాల ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభకు పెద్ద ఎత్తున గిరిజనులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, అదే రోజు స్వాతంత్య్ర సమర యోధులు, కళాకారులకు సన్మానాలు నిర్వహించాలన్నారు తెలిపారు.
తెలంగాణా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల కార్యక్రమాలన్నీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరిగేలా జిల్లా అధికారుల సమన్వయంతో పని చేయాలని, తదనుగుణంగా ప్రణాళిక రూపొందించాలని డిజిపి మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులను కోరారు.
జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మాట్లాడుతూ, 16న జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ర్యాలీ నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసామని, స్థానిక ఎమ్మెల్యేలతో  సమన్వయం చేసుకొని ర్యాలీ విజయవంతం చేస్తామని తెలిపారు. ర్యాలీ అనంతరం భోజనం ఏర్పాటు కోసం అవసరమైన ఏర్పాటు చేస్తున్నమని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైన బ్యారి కేడ్లు ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. 17న జిల్లాలో జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తామని, జిల్లా నుంచి 13 వేల 500 మంది ఎస్టీలను బస్సుల ద్వారా మండల కేంద్రాల నుంచి తరలిస్తున్నామని, వారికి అవసరమైన త్రాగునీరు, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసామని, సకాలంలో హైదరాబాద్ చేరే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 18న జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా ముఖ్యమైన భవనాలు ట్రై కలర్ లైటింగ్ సుందరికరణ పనులు చేపట్టామని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు తిరుపతి రావు, ప్రతీక జైన్, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, జిల్లా పరిషత్ సీఈఓ దిలీప్ కుమార్, పిడి డీఆర్డీఏ ప్రభాకర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ ట్రాన్స్ ఫోర్ట్ అధికారి ప్రవీణ్ రెడ్డి, పోలీస్ అధికారులు, రోడ్లు భవనాలు ఈఈ శ్రవణ ప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Attachments area