తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం

` ప్రజల ఒత్తిడితోనే కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం
` తెలంగాణలో కాంగ్రెస్‌ సామాజిక న్యాయం 2.0 ఉద్యమం
` రాష్ట్రపతి అనుమతి కోసం ఎదురు చూస్తున్న బీసీ బిల్లు
` రాహుల్‌ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం పోరాటం
` రాహుల్‌, ఖర్గేలతో సీఎం రేవంత్‌, భట్టి తదితరుల భేటీ
` ఎక్స్‌ వేదికగా వివరాలు వెల్లడిరచిన మల్లి కార్జున ఖర్గే
న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణలో శాస్త్రీయ్రంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శం కావాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉద్ఘాటించారు. తెలంగాణ సర్వే ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యాసంస్థల్లో ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సిఫారసు చేస్తోందని తెలిపారు. బీసీ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తోందని వెల్లడిరచారు. ఈ చారిత్రాత్మక ప్రయత్నంలో కృషి చేసిన విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి. సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలోని బృందానికి మల్లికార్జున ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ- సీఎం, మంత్రిమండలి, ఎంపీలకు ఖర్గే ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మల్లికార్జున ఖర్గే పోస్ట్‌ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ సామాజిక న్యాయం 2.0 ఉద్యమాన్ని ప్రారంభించిందని చెప్పుకొచ్చారు. బలహీన వర్గాల కోసమే ఈ న్యాయ పోరాటమని నొక్కిచెప్పారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ నిరంతర పోరాటం చేస్తోందని ఉద్ఘాటించారు. దశాబ్దాలుగా పక్కకు నెట్టివేయబడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల ప్రజల గళంగా కాంగ్రెస్‌ పనిచేస్తోందని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు.దేశ జనాభాలో మెజార్టీ సంఖ్య అయినా… కార్పొరేట్‌ బోర్డులు, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, ఉన్నత విద్యాసంస్థల్లో వర్ణహీనత కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో కూడా అన్యాయం జరుగుతోందని.. ఈ విషయాన్ని పార్లమెంట్‌లో ప్రస్తావించారని గుర్తుచేశారు. 80 శాతం ఓబీసీ ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. అలాగే 83 శాతం ఎస్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా జాతీయ కుల గణాంకాల సవిూక్ష జరపాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ఒత్తిడికి లోనై కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపిందని… కానీ 50 శాతం రిజర్వేషన్‌ పరిమితిని ఎందుకు తొలగించలేదని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. రాహుల్‌ గాంధీ నాయకత్వంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు. దశాబ్దాలుగా అణచివేతకు గురైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాల ప్రజల గొంతుకగా కాంగ్రెస్‌ పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు. దేశ జనాభాలో మెజారిటీ-గా ఉన్నా.. కార్పొరేట్‌ బోర్డులు, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ, ఉన్నత విద్యా సంస్థల్లో వివక్ష కొనసాగుతోందన్నారు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లోనూ అన్యాయం జరుగుతోందన్నారు. దేశవ్యాప్తంగా జాతీయ కుల గణాంకాల సవిూక్ష జరపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. ప్రజల ఒత్తిడితోనే కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కానీ, 50 శాతం రిజర్వేషన్‌ పరిమితిని తొలగించలేదు. ఢల్లీిలో ఏఐసీసీ నేత మల్లికార్జున ఖర్గే నివాసంలో ఆయనతోపాటు- రాహుల్‌ గాంధీని తెలంగాణ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చలు చేపట్టారు. అంతేకాకుండా 50శాతం రిజర్వేషన్‌ నిబంధనను తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ప్రజల ఒత్తిడికి లోనై కుల గణన నిర్వహించేందుకు అంగీకరించినా, 50 శాతం పరిమితిని తొలగించడానికి సిధ్దంగా లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా సంస్థలలో ఓబీసీలకు 42శాతం రిజర్వేషన్లు సిఫారసు చేసిందని.. ప్రస్తుతం ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నదని ఆయన గుర్తు చేశారు.