జాతీయ స్థాయి స్కాలర్ షిప్ పరీక్ష లో మోడల్ స్కూల్ విధార్థినిల ప్రతిభ

అభినందించిన కలెక్టర్
యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
 మోడల్ స్కూల్ విధ్యార్హ్దులు జాతీయ స్థాయి స్కాలర్ షిప్ టెస్ట్ లో మన  జిల్లా నుండి అత్యధికంగా 12 మంది విద్యార్ధులు ఎంపిక కావడం అభినందించదగ్గ విషయమని జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి అన్నారు. 12 మంది విధ్యార్ధులను తమ ఛాంబర్ లో అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒకే స్కూల్ నుండి ఇంతమంది స్కాలర్ షిప్ పొందడం జిల్లాకే గర్వకారణం అని విధ్యార్ధులకు దిశ నిర్దేశం చేశారు. కష్టపడి చదవడం ద్వారానే మెదస్సును పెంచుకోవచ్చునని విధ్యార్ధులు  ఈ దశలోనే అభ్యసనం మెరుగు పరుచుకోవడానికి అవకాశం ఉంటుందని , ఈ సందర్భంగా విధ్యార్ధులకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నరేష్ కుమార్ రెడ్డి, అధ్యాపకులు శ్రీనివాస్, సునీత, విధ్యార్ధులు పాల్గొన్నారు.