జిలెటిన్ స్టిక్స్ పేలుడు.. ఒకరి మృతి

pfuoq0mpరంగారెడ్డి : రాజేంద్రనగర్ మండలం మంచి రేవులలో ఓ స్ర్కాప్ దుకాణంలో సంభవించిన అగ్నిప్రమాదంలో జిలెటిన్ స్టిక్స్ పేలాయి. ఈ ప్రమాదంలో మీసాల కుమార్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.