జిల్లా ఎస్పీని కలిసిన జిల్లా ఫోటో ,వీడియో గ్రాఫర్స్ నూతన కమిటీ

గద్వాల నడిగడ్డ ఆగస్టు 29 (జనంసాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా
గద్వాల పట్టణం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ నూతన కమిటీ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి నూతన కమిటీ జోగులాంబ గద్వాల జిల్లా ప్రెసిడెంట్ ఎస్ ఎస్ శేఖర్, టౌన్ ప్రెసిడెంట్ గిరి, కార్యదర్శులు ,సభ్యులు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్ పి రంజన్ రతన్ కుమార్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. జిల్లాలోని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ సభ్యులకు అన్నివేళలా కమిటీ తరఫునుంచి అండదండలుగా ఉండి వారిని ఆదుకుంటామని తమపై నమ్మకం ఉంచి తమను ఎన్నుకున్నందుకు ఫోటోగ్రాఫర్ అండ్ వీడియో గ్రాఫర్ సోదరులకు ధన్యవాదాలు తెలియజేశారు.