జిల్లా కోసం కండ్లకు గంతలు కట్టుకొని నిరసన:-

మిర్యాలగూడ. జనం సాక్షి
       మిర్యాలగూడను జిల్లా చేయాలని కోరుతూ మిర్యాలగూడ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం పట్టణంలోని వై’ జంక్షన్ వద్ద గల అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ముందు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అన్ని వనరులు ఉన్నా మిర్యాలగూడను వెంటనే జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఏర్పాటులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు ఏమిటో ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మిర్యాలగూడ జిల్లా సాధన సమితి నాయకులు సయ్యద్ ఫారుక్,బంటు వెంకటేశ్వర్లు, వజ్రగిరి అంజయ్య, చేగొండి మురళి యాదవ్, నీలకంఠన్ నాయక్, మోసిన్ అలీ, జానీ బాబా, దశరధ నాయక్,పిట్టల రవి తదితరులు పాల్గొన్నారు.