జిల్లా చైర్మన్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో వీఆర్ఏ కుటుంబానికి ఆర్ధిక సహాయం

కేసముద్రం అక్టోబర్ 20 జనం సాక్షి /మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సీతానగరం గ్రామ వీఆర్ఏ తాటి సుహాసిని  కూతురు వీఆర్ఏల నిరవధిక సమ్మె లో పాల్గొని మద్దతు తెలిపి అనారోగ్య కారణంగా ఈ నెల 16 తేదీన మరణించగా వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని జిల్లా కో-కన్వీనర్ దారావత్ జుంకిలాల్ చరవాణి ద్వారా అందరికి సమాచారం ఇచ్చి రాష్ట్ర వీఆర్ఏ లు,అధికారులు అందరు తమ వంతుగా కొంత ఆర్థిక సహాయం చేయగా మొత్తం1,23,316(ఒక లక్ష ఇరువై మూడు వేయిల మూడు  వందల పదహారు రూపాయలు) గురువారం రోజున వీఆర్ఏ జేఏసీ నాయకుల చేతుల మీదిగా వారి కుటుంబానికి అందచేయడం జరిగినది .ఈ కార్యక్రమంలో రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ సెక్రటరీ జనరల్ దాదే మియా,కో కన్వీనర్ లు శిరీష రెడ్డి, రఫీ,సునీత వెంకట్, నర్సింహారావ్,మహబూబాబాద్ చైర్మన్ బెజ్జం భరత్ కుమార్,దూకుంట్ల శ్రీనివాస్, ప్రభాకర్,కంభంపాటి సతీష్, శ్రవణ్, శిరీష,గార రత్తయ్య,ఖమ్మం జిల్లా చైర్మన్ అజీజ్,లింగరాజు, వరంగల్ జిల్లా చైర్మన్ కర్ణకంటి రాజేష్,  జయశంకర్ భూపాలపల్లి చైర్మన్ రాజన్న,  మండల చైర్మన్ పడిగె శ్రీను, దారావత్ రవి, అల్లాడి శ్రీనివాస్, రాము, స్నేహలత, నాగలక్ష్మి, డోర్నకల్ బాలకృష్ణ, చంద్ర శేఖర్, డానియల్, మీరా తదితరులు పాల్గొన్నారు.
Attachments area